- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు : జిల్లాలో విద్యాశాఖపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టిపెట్టారు. పరీక్షలు సమీపిస్తుండగా పాస్ పర్సెంటేజ్పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని స్కూళ్లను సందర్శిస్తూ విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తున్నారు. గతేడాది టెన్త్ లో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పది ఫలితాల్లో వెనకపడటంపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈసారి వందశాతం పాస్ పర్సెంటేజ్ను పెంచేందుకు కలెక్టర్ ఫోకస్ చేశారు.
హైదరాబాద్ జిల్లా కొన్నేండ్లుగా చివరి స్థానం, లేదా చివరి నుంచి రెండు, మూడు స్థానాలకు పరిమితం అవుతూ వస్తుంది. దీంతో కలెక్టర్ ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. పాస్ పర్సంటేజ్ను పెంచడానికి తగు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, డీఐవోలు, అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎగ్జామ్స్ కు నెల రోజుల సమయం ఉండగా ప్లానింగ్తో పిల్లలను చదివించాలని
రివిజన్ చేయించడంతో పాటు స్లిప్ టెస్టులు రెగ్యులర్ గా నిర్వహించేలా అధికారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలోని వివిధ స్కూళ్లను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ఆదేశిస్తున్నారు. పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ.. ఏ సబ్జెక్ట్ ఎలా చదివితే సులువుగా అర్థం చేసుకోవచ్చో వివరించి చెబుతున్నారు.