హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేస్తున్న హైదరాబాద్ కంపెనీ రెటీనా పెయింట్స్ మరో మూడు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒడిస్సా, కర్నాటక, మధ్యప్రదేశ్లో ఎంటర్ అయ్యామని పేర్కొంది. అంతేకాకుండా తమ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ కేఎస్ భరత్ను నియమించింది. రూ. వెయ్యి కోట్ల టర్నోవరే టార్గెట్గా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాకేష్ పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ల ప్లాన్స్ గురించి త్వరలో బయటపెడతామని చెప్పారు. ఇతర పెయింట్ కంపెనీలతో పోలిస్తే తాము హై క్వాలిటీ, సస్టయినబుల్ పెయింట్ను తయారు చేస్తున్నామని వెల్లడించారు. రెటీనా పెయింట్స్ వివిధ రకాల పెయింట్స్ను, కోటింగ్స్ను తయారు చేస్తోంది.
‘కేఎస్ భరత్ను తమ బ్రాండ్ అంబాసిడర్గా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆయనకున్న స్కిల్స్, పట్టుదల, క్రికెట్పై అంకిత భావం వంటివి తమ బ్రాండ్కు సరియైన బ్రాండ్ అంబాసిడర్గా భరత్ను నిలిపాయి’ అని రెటీనా పెయింట్స్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కస్టమర్ల సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, తమ వాల్యూస్కు భరత్ రిప్రజెంట్ చేస్తారని వెల్లడించింది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రెటీనా పెయింట్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు.