Hyderabad : సైబర్ నేరాలు 48 శాతం పెరిగినయ్ ..రాచకొండ సీపీ సుధీర్ బాబు

Hyderabad : సైబర్ నేరాలు 48 శాతం పెరిగినయ్ ..రాచకొండ సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గతేడాదితో పోలిస్తే సైబర్​నేరాలు 48 శాతం పెరిగాయని రాచకొండ సీపీ సుధీర్​బాబు తెలిపారు. బుధవారం తన ఆఫీస్​లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అకౌంట్​ఓపెనింగ్, హెల్ప్ డెస్క్ నిర్వహణ, మనీ ట్రాన్సాక్షన్స్​తదితర వివరాలను అడిగారు. లేట్, టైమ్‌‌‌‌ అవుట్ లావాదేవీల్లో బాధితుల కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు, రీఫండ్ పై చర్చించారు. సైబర్​ఫ్రాడ్స్​ను గుర్తించేందుకు ఒక వాట్సాప్​ గ్రూప్​క్రియేట్​చేయాలని నిర్ణయించారు. 27 బ్యాంకుల అధికారులు, సైబర్ క్రైం పోలీసులు పాల్గొన్నారు.