
జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులో 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం వరకు ఫీజులో రాయితీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాధికారి (డీఈఓ) ఆర్.రోహిణి యాజమాన్యాలను కోరారు. దీనికి సంబందించిన ఉత్తర్వులను జూన్ 10న విడుదల చేశారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 50 శాతం వరకు ఫీజులో రాయితీ కల్పించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే –- టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ కోరిన విషయం తెలిసిందే. దీనికి డీఈవో రోహిణి సానుకూలంగా స్పందించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు జర్నలిస్ట్ ల పిల్లలకు ఫీజులో 50 శాతం వరకు రాయితీ కల్పించాలని కోరారు. డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఐఓఎస్ (ఎంఈవో)లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డీఈవో రోహిణికి హెచ్ యూజే -టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్ లోని జర్నలిస్ట్ లు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.