అయ్యోపాపం ఎంత కష్టం వచ్చింది.. ఓ పక్క దు:ఖంతో కన్నీళ్లు దిగమింగారు.. మరోపక్క టెన్త్ ఎగ్జామ్ రాశారు..!

అయ్యోపాపం ఎంత కష్టం వచ్చింది.. ఓ పక్క దు:ఖంతో కన్నీళ్లు దిగమింగారు.. మరోపక్క టెన్త్ ఎగ్జామ్ రాశారు..!

 వంగూరు/మానవపాడు, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలం ఉల్పర జడ్పీ హైస్కూల్ లో టెన్త్​ చదువుతున్న డి.శివకృష్ణ తండ్రి ఆదివారం రాత్రి అనారోగ్యంతో చనిపోయాడు. సోమవారం ఎగ్జామ్​ ఉండడంతో కన్నీళ్లను దిగమింగుతూ పరీక్షకు హాజరయ్యాడు. ఎగ్జామ్​ రాసి వచ్చాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. 

అలాగే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన కరీం ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో చనిపోయాడు. అతని కొడుకు సమీర్​ పుట్టెడు దు:ఖంలోనూ టెన్త్​ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. పరీక్ష​ రాసి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించారు.