Hyderabad : సీపీ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ కోర్ట్ .. రౌడీ షీటర్లు, గ్యాంగ్స్ మధ్య రాజీ

Hyderabad : సీపీ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ కోర్ట్ .. రౌడీ షీటర్లు, గ్యాంగ్స్ మధ్య రాజీ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లోని సీపీ ఆఫీస్ లో బుధవారం సీపీ సీవీ ఆనంద్​ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్​ కోర్ట్​ జరిగింది.  సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌‌‌‌లలో రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్‌‌‌‌ల మధ్య జరుగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు ఈ కోర్టు నిర్వహించారు. 

10  పోలీసు స్టేషన్ల  పరిధి నుంచి వచ్చిన రిపోర్ట్​ల ఆధారంగా రౌడీ షీటర్లను, గ్యాంగ్స్​ను పిలిపించారు.  సుమారు  11 గ్యాంగ్‌‌‌‌లలోని 101 సభ్యులు పరస్పర దాడులు, హత్యలు, హత్యాయత్నాల వంటి నేరాలకు  పాల్పడినవారు ఉన్నారు. ఈ కోర్టు విచారణలో 6 గ్యాంగ్‌‌‌‌లకు కుటుంబ సభ్యుల సమక్షంలో సీపీ రాజీ కుదుర్చారు.  మిగిలిన గ్యాంగ్‌‌‌‌లు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. నగర శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ కోర్టులో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.ఆపూర్వారావు, 10 పోలీసు స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.