ట్విన్ సిటీస్ లో ఒకేసారి 32 ఖాజీ ఆఫీసులు

ట్విన్ సిటీస్ లో ఒకేసారి  32 ఖాజీ ఆఫీసులు
  •  స్టేట్​ మైనార్టీ​ కమిషన్​ఛైర్మన్​ తారిఖ్​ అన్సారీ

పద్మారావునగర్​, వెలుగు :  సిటీలో ఒక్క ఖాజీ​ ఆఫీస్​ తో ముస్లింలు ఇబ్బంది పడేవారని, సీఎం కేసీఆర్ ​ చొరవతో ఒకేసారి 32 ఖాజీ డివిజన్​ కేంద్రాలను మంజూరు చేశారని స్టేట్​ మైనార్టీ కమిషన్​ చైర్మన్​ తారిఖ్​అన్సారీ పేర్కొన్నారు. బుధవారం బౌద్ధనగర్​ డివిజన్​ లలితానగర్​ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఖాజీ ఆఫీస్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సౌత్​ వెస్ట్ జోన్​ అడిషనల్​ డీసీపీ అష్పక్ అహ్మద్​, స్టేట్​మైనార్టీ నేతలు షేక్​ కలీం, నేతలు కిషోర్​ గౌడ్, నోమన్​ అహ్మాద్​, కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ పాల్గొన్నారు.