ఫేస్బుక్లో వచ్చిన యాడ్ చూసి పెట్టుబడులు..రూ.45 లక్షలు హాంఫట్

ఫేస్బుక్లో వచ్చిన యాడ్ చూసి పెట్టుబడులు..రూ.45 లక్షలు హాంఫట్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ పెట్టుబడుల పేరిట ఓ వ్యక్తిని స్కామర్లు మోసం చేశారు.  నల్లకుంటకు చెందిన 52 ఏండ్ల వ్యక్తి ఫేస్​బుక్​లో ‘ఇన్వెస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే యాడ్​ను నమ్మి తన వివరాలు నమోదు చేశాడు. దీంతో స్కామర్లు ‘స్టడీ సర్కిల్’ అనే వాట్సాప్ గ్రూప్​లో బాధితుడిని చేర్చి ట్రేడింగ్, పెట్టుబడిపై సూచనలు ఇచ్చారు. 

వారి మాటలు నమ్మిన బాధితుడు.. స్కామర్స్ సూచించిన ట్రేడింగ్ అప్లికేషన్​లో విడతల వారీగా మొత్తం రూ.45 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, రూ. 6.9 కోట్ల లాభం ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బును విత్​డ్రా చేసేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు.  దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.