- 5 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
మియాపూర్, వెలుగు: పశువుల అక్రమ రవాణాతోపాటు తాళం వేసిన ఇండ్లే టార్గెట్గా చోరీలు చేస్తున్న ఇద్దరిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సైదాబాద్ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్, గోల్కొండ ఝాన్సీ బజార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అయూబ్ పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాళం వేసిన ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.
గత నెల 11న ఆర్సీపురం నందన్రతన్ ప్రైడ్కు చెందిన మస్తాన్ ఇంట్లో 21 తులాల బంగారం, 3 కేజీల వెండి, కొంత నగదు చోరీ చేశారు. బాధితుడి బంధువు మహ్మద్ సోహైల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసిన అవేజ్అహ్మద్, అయూబ్ను అరెస్ట్చేశారు. దొంగిలించిన బంగారాన్ని అయూబ్భార్య గోల్డ్షాపుల్లో అమ్ముతుందని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇద్దరూ జైలుకెళ్లొచ్చారు..
అవేజ్ అహ్మద్2006 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. 103 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనురేచీకటి సమస్యతో బాధ పడుతుండగా.. పగటి పూటనే కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేసేవాడు. ఇప్పటివరకు 8 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. మేడిపల్లి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అవేజ్పై పీడీ యాక్ట్నమోదైంది.
జైలులో ఉన్నప్పుడు అవేజ్కు అయూబ్ పరిచయమయ్యాడు. అయూబ్ 2007 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు 238 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 11 పోలీస్స్టేషన్ల పరిధిలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై శంషాబాద్, చిలకలగూడ పోలీస్ స్టేషన్లలో పీడీ యాక్ట్నమోదైంది. జైలు నుంచి బయటకొచ్చాక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని ఏసీపీ తెలిపారు.
బైక్లను ఎత్తుకెళ్తున్న అంతర్రాష్ట్ర దొంగలు..
ఇండ్లు, అపార్ట్మెంట్లు, షాపుల ఎదుట పార్కింగ్చేసిన బైక్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్చేశారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నారాయణపురానికి చెందిన నాలందుర్గ శ్రీనివాస్ సాయి కిరణ్ , గొట్టపు లీలసాయి, ఈస్ట్గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన విజయ్ శివసాయి ప్రసాద్, ఇదే జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ప్రవీణ్ ముఠాగా ఏర్పడ్డారు.
ఈజీగా డబ్బు సంపాదించేందుకు బైక్లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. నగరానికి వచ్చి అర్ధరాత్రి అపార్ట్మెంట్లు, ఇండ్లు, షాపులు, హాస్టళ్ల ఎదుట పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను దొంగతనం చేస్తున్నారు. వాటిని సొంతూళ్లకు తీసుకెళ్లి, ఇంజిన్, చాసిస్నంబర్లను మార్చేస్తున్నారు. అనంతరం వాహనాలను తెలిసిన వారికి అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
21 బైక్లు స్వాధీనం..
ఇటీవల మియాపూర్పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్చోరీకి గురవడంతో యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా శ్రీనివాస్సాయికిరణ్, లీల సాయిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. విజయ్శివసాయి ప్రసాద్ నుఏపీలోని అనకాపల్లిలో ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ను దొంగలిస్తుండగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.
వీరిపై కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో 11, అమీన్పూర్లో 3, చందానగర్లో 3, గచ్చిబౌలిలో 3, మియాపూర్లో ఒకటి, ఆర్సీపురంలో ఒక బైక్చోరీలు కేసులు నమోదయ్యాయి. మియాపూర్సీఐ శివప్రసాద్, డీఐ రమేశ్నాయుడు, డీఎస్సై నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
