చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్

చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్

హైదరాబాద్: చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. పాతబస్తీలో నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వారి నుంచి ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట తన కొడుకు కనిపించడం లేదంటూ ఓ చీరల వ్యాపారి ఫజల్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్… సి సి ఫుటేజ్ ఆధారంగా  నలుగురు మహిళలను అదుపులోకి తీసుకొన్నారు.  ఇంటి ముందు ఒంటరిగా ఆటలాడుకుంటున్న చిన్నారులను టార్గెట్ చేసే ఈ ముఠా పిల్లలు లేని వారికి 10 వేల నుండి 30 వేల వరకు అమ్మకం జరపుతారని విచారణలో తేలింది. ఈ ముఠా ఇంకా ఎవరినైనా పిల్లల్ని కిడ్నాప్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.