డ్రోన్ల వాడకం, క్రాకర్స్​ కాల్చడంపై నిషేధం

డ్రోన్ల వాడకం, క్రాకర్స్​ కాల్చడంపై నిషేధం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీపీలు సీవీ ఆనంద్‌, అవినాశ్‌ మహంతి

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్‌, సైబరాబాద్ పోలీస్​కమిషరేట్ల పరిధిలో డ్రోన్లు, క్రాకర్స్‌పై నిషేధం విధించారు. భారత్‌, పాకిస్తాన్​మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌, సైబరాబాద్ సీపీ అవినాశ్​మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుతోపాటు చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుందని సీపీ అవినాశ్‌ మహంతి స్పష్టం చేశారు. ఎయిర్​పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ మేరకు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

జూన్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఫైర్ క్రాకర్స్‌ కాల్చ కూడదని సీపీ ఆనంద్​పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ శబ్ధాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.