డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

ముంబై లో డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి టోలిచౌకిలో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టోలీచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. అయితే డ్రగ్స్ కావాలని పోలీసులు ఇర్ఫాన్ ను ట్రాప్ చేశారు. దీంతో వినియోగదారుడు అనుకొని డ్రగ్స్ ప్యాకెట్ ను ఎసై చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ ను పట్టుకొని అతని నుంచి 8.56 గ్రాముల హెరాయిన్ ను అదుపులోకి తీసుకున్నారు.

ముంబాయికి చెందిన గయాజ్ దగ్గర వీటిని కొనుగోలు చేశానని ఇర్ఫాన్ తెలిపారు. ఇర్ఫాన్, గయాజ్‌లపై నార్కోటిక్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గయాజ్ పరారీలో ఉన్నాడు. ఇర్ఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.