కరోనాకి చెక్ పెట్టే పుట్టగొడుగులు..ట్రయల్స్ ప్రారంభం

కరోనాకి చెక్ పెట్టే పుట్టగొడుగులు..ట్రయల్స్ ప్రారంభం

సాంప్రదాయ విజ్ఞానాన్ని,ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో కలిపి హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) కరోనాకు వ్యతిరేకంగా పోరాడేలా రోగనిరోదగక శక్తిని పెంచే కరోనా ఎయిడ్ అనే సప్లిమెంట్ ను తయారు చేసింది.  సీసీఎంబీలోని అటల్‌ ఇక్యుబేషన్‌లో అంబ్రోసియా ఫుడ్‌ఫామ్స్‌తో ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించి ఈ ఫుడ్‌ సప్లిమెంట్‌ను రూపొందించింది. దీన్ని పుట్టగొడుగుల్లోని కార్డిసెపిన్‌, పసుపులోని కర్క్యుమిన్‌ మిశ్రమంతో తయారు చేశారు. సాధారణంగా మనం ఆహారంగా తీసుకునే పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హిమాలయాల్లో లభించే అరుదైన  కార్డిసె్‌ప్సమిలిటారిస్‌  రకం పుట్టగొడుగుల్లోని కార్డిసెపిన్స్‌.. వైర్‌సలకు సంబంధించిన కొత్త ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ పోగులు తయారు కాకుండా నిలువరిస్తాయని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సారథి డాక్టర్‌ మధుసూధనరావు తెలిపారు.  హైదరాబాద్‌కు చెందిన అంబ్రోసియా ఫుడ్ కంపెనీ సహకారంతో కరోన్‌ఏయిడ్‌ను అభివృద్ధి చేసిన క్లోన్ డీల్స్‌కు చెందిన డాక్టర్ ప్రకాష్ అయోధ్య పాండెం మాట్లాడుతూ  వైద్య పరిభాషలో ఔషధ గుణాలున్న దీన్ని సంజీవని భూతి అని పిలుస్తారని అన్నారు. హిమాలయాలలో ప్రతి సంవత్సరం పుట్టగొడుగు రెండు నెలలు మాత్రమే పెరుగుతుంది కాబట్టి. క్లోన్ డీల్స్ ఔషధ వినియోగం కోసం నియంత్రిత వాతావరణంలో దాన్ని పెద్ద ఎత్తులో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే దీని క్లినికల్ ట్రయల్ కోసం మొదటి దశ నాగ్ పూర్, భోపాల్, ముంబైలో జరుపుతున్నట్లు  క్లోన్ డీల్స్ సీఈఓ అతిక్ పటేల్ ఎన్డీటీవీ చెప్పారు.