సంక్రాంతి పండుగతో నగరం ఖాళీ అయ్యింది. ఇతర ప్రాంతాలకు చెందిన జనాలంతా సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ప్రధాన రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెయిన్సెంటర్లు బోసిపోయి కనిపించాయి. ట్యాంక్బండ్, లక్డీకాపూల్, అసెంబ్లీ, అమీర్పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఐటీ కారిడార్, నానక్రామ్గూడ, హైటెక్సిటీ, దిల్సుక్నగర్, ఎల్బీ నగర్, మలక్పేట తదితర ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. నిత్యం గంటల తరబడి ట్రాఫిక్సమస్యలను ఎదుర్కొనే నగర ప్రజలు బుధవారం మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయారు. అంతటా వాహనాల రణగొణ ధ్వనులు తగ్గాయి. – హైదరాబాద్ సిటీ, వెలుగు
