పట్నం పర్యాటక కేంద్రాలన్నీ కిటకిట

పట్నం పర్యాటక కేంద్రాలన్నీ కిటకిట

ఓల్డ్​సిటీ వెలుగు : ఓల్డ్​సిటీలోని నెహ్రూ జూ పార్క్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండతోపాటు బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. గత మూడు రోజులుగా వరుస సెలవులు రావడంతో నగరంలోని హోటళ్లలో దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పర్యాటకులు వచ్చారు. 

ఆదివారం నెహ్రూ జూ పార్క్​ను 25,875 మంది సందర్శించగా, దాదాపు 10 వేల మంది చార్మినార్​పైకి ఎక్కి నగర అందాలను తిలకించారు. రద్దీ కారణంగా ఓల్డ్​సిటీలోని ఇరుకు రోడ్లతో సందర్శకులకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. కిలోమీటర్ వరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ జామ్, పార్కింగ్ సమస్యలతో సతమతమయ్యారు.