హైదరాబాద్: గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలో మీటర్ల మేర కార్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం వేళలో ఆఫీస్లకు వెళ్లే వాళ్లు, బిజినెస్ పని మీద వెళ్లే వాళ్లు ట్రాఫిక్ కారణంగా నరకం చూశారు. మాదాపూర్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ వైపుకు వచ్చే శిల్పా లేవుట్ ప్లైఓవర్పై కారు ఆగి పోవడంతో ట్రాఫిక్ జాం అయింది. ఈ కారణంగా.. గచ్చిబౌలి నుంచి నానక్ రామ్ గూడ మార్గంలో, గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ టోల్ గేట్ మార్గంలో ట్రాఫిక్ జాం అయింది. రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్తో ఐటీ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు.
ఐటీ కారిడార్లోఉదయం, సాయంత్రం వేళల్లో కార్లు, బైక్ల వేగం 10 నుంచి 30 స్పీడ్ దాటడం లేదు. 10 కిలోమీటర్ల దూరానికి గంటకు పైనే టైమ్ పడుతోంది. దీంతో ఈ ట్రాఫిక్లో ఆఫీసుకు వెళ్లడం కంటే అవకాశం ఉంటే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవడమే బెస్ట్ అని ఉద్యోగులు భావిస్తున్నారు.
మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో, ఇతర జాబ్లు చేసేవారు సిటీ నలుమూలల నుంచి క్యాబ్లు, బైక్లు, సొంత కార్లు, పబ్లిక్ సర్వీసులలో ఐటీ కారిడార్కు చేరుకుంటారు. దీంతో ఈ రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోని రోడ్లు మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంటాయి.

