హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ఏరియాల వైపు వెళ్తే మాత్రం..

హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన..  రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ఏరియాల వైపు వెళ్తే మాత్రం..

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి నిలయం, రాజ్​భవన్ రూట్​లో వీవీఐపీ/వీఐపీల కదలికల కారణంగా సికింద్రాబాద్, తిరుమలగిరి, బేగంపేట ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

ఈ క్రమంలో ఇవాళ-ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు  సీటీవో జంక్షన్, రసూల్​పుర, పీఎన్టీ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్​ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మొనప్ప జంక్షన్, యషోద హాస్పిటల్, కట్రియా హోటల్, మెట్రో రెసిడెన్సీ, వీవీ స్టాట్యూ, రాజ్​భవన్ వద్ద ట్రాఫిక్ ఆపేయవచ్చు లేదా డైవర్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. 

అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు రాజ్ భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, కట్రియా, యషోద మొనప్ప , పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్,  బేగంపేట్ ఫ్లైఓవర్,  పీఎన్టీ, రసూల్​పుర, టీవోలీ ఎన్సీసీ, క్లబ్-ఇన్ గేట్,  ఏర్టెల్ జంక్షన్ , కార్ఖానా,  ఆర్టీఏ తిరుమలగిరి,  తిరుమలగిరి క్రాస్ రోడ్ హోలీ ఫ్యామిలీ, లాల్ బజార్ , ఎంసీఈఎంఈ , లోతుకుంట, సత్య పెట్రోల్ పంప్, అల్వాల్ టీ జంక్షన్ , ఏఓసీ సెంటర్ , బైసన్ సిగ్నల్ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందన్నారు.

సాయంత్రం 5:30 నుంచి రాత్రి 6:45 వరకు బైసన్ సిగ్నల్ నుంచి పై రూట్లోనే తిరిగి రాజ్​భవన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. 22న ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు రాజ్​భవన్, వీవీ స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ, కట్రియా, యషోద, మొనప్ప, పంజాగుట్ట, గ్రీన్​ల్యాండ్స్​, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్​పుర, సీటీవో వరకు ఆంక్షలు ఉంటాయిని, ఈ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ సమాచారం కోసం హెల్​లైన్ నంబర్ 9010203626కు సంప్రదించవచ్చని సూచించారు.