గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో 40 శాతం మంది కార్మికులు సరిగా విధులకు రాని కారణంగానే మేనేజ్మెంట్150 మస్టర్ల సర్క్యులర్జారీ చేసిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్వి.సీతారామయ్య తెలిపారు. కార్మికుల హాజరు శాతం తగ్గడంతో మెషీన్లు ఖాళీగా ఉండి బొగ్గు ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడుతుందనే అలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు.
గురువారం జీడీకే –2 గనిపై జరిగిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. డ్యూటీలకు రెగ్యులర్గా హాజరయ్యే కార్మికులకు 150 మస్టర్ల సర్క్యులర్నుంచి మినహాయింపు ఇవ్వాలని స్ట్రక్చర్డ్ మీటింగ్ లో అధికారులకు సూచించినట్టు గుర్తుచేశారు.
సొంతింటి స్కీమ్ అమలుపై కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులకు అన్యాయం జరిగితే యూనియన్చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు.
