మెట్రో ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. రైలెక్కితే జేబుకు చిల్లే..

మెట్రో ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. రైలెక్కితే జేబుకు చిల్లే..

హైదరాబాద్​ మెట్రో ప్రయాణికులకు షాక్​ ఇచ్చేందుకు రడీ అయిందని సమాచారం అందుతోంది.  మెట్రో వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మే నెలలో టికెట్​ రేట్లను పెంచే అవకాశం ఉంది.   మెట్రో చార్జీలు పెంచే అంశంపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ లేఖ రాసింది. హైదరాబాద్​ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్​ అండ్​ టీ సంస్థ చైర్మన్​ అమెరికా పర్యటనలో ఉన్నారు.  ఆయన భారత్​ కు రావడంతోనేఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఎల్​ అండ్​ టీ సంస్థ చార్జీల టారిఫ్​ తో ఈ ఏడాది రూ. 150 కోట్లు ఆదాయాన్ని పొందాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది.  ఈ లక్ష్య సాధనలో హైదరాబాద్​ లో మెట్రో టికెట్లు పెంచనుంది. 

ప్రస్తుతం మెట్రో ట్రైన్​ గరిష్ఠ చార్జి రూ. 60 లు కాగా.. దానిని రూ, 75కు పెంచే అవకాశం ఉంది.  అలాగే మినిమమ్​ టికెట్​ రూ. 10 లు.  అయితే దీని విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.   మెట్రో ట్రైన్​ లో ఎడ్వర్​టైజ్​ మెంట్స్​.. పలు స్టేషన్లలో షాపింగ్​ మాల్స్​.. ఇతర ఆదాయ మార్గాల ద్వారా  ఎల్​ అండ్​ టీ సంస్థ రూ. 1500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.  అయితే ఉద్యోగుల జీతాలు.. బ్యాంక్​ రుణ వడ్డీలు... ఇతర నిర్వహణ ఖర్చులు ఏడాదికి 2 వేల కోట్ల రూపాయిల వరకు ఉంటుందని.. ఈ క్రమంలో నష్టాల బారి నుండి బయటపడాలంటే చార్జీలు పెంచకతప్పదని హైదరాబాద్​ మెట్రో సంస్థ ఎల్​ అండ్​ టీ అధికారులు తెలిపారు.