పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా

పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా

వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ శివస్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు. అయితే శివస్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది చెప్పడంతో వారిని జైలు బయటే కూర్చోబెట్టారు. పోలీసులు మాయమాటలు చెప్పి అరెస్ట్ చేశారని.. మాల తీసేసు ప్రసక్తే లేదని శివస్వాములు స్పష్టం చేశారు.