
- ఇండియా విభాగం
- కొత్త సీఈఓగా తరుణ్ గార్గ్
- 2027లో జెనెసిస్ బ్రాండ్ ఎంట్రీ
- ప్రకటించిన హ్యుందాయ్
ముంబై: దక్షిణ కొరియా ఆటో కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి మనదేశంలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తరుణ్ గార్గ్ను ఇండియా విభాగానికి ఎండీ, సీఈఓగా నియమించింది. కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మునోజ్ ఢిల్లీలో బుధవారం 2030 రోడ్మ్యాప్ను ప్రకటించారు. సేల్స్, ఫైనాన్స్ విభాగం హ్యుందాయ్ క్యాపిటల్ 2026 రెండో క్వార్టర్ నాటికి దశలవారీగా భారత్లోకి ప్రవేశిస్తుంది. లగ్జరీ బ్రాండ్ జెనెసిస్ కూడా 2027 నాటికి మార్కెట్లోకి వస్తుంది.
2030 ఆర్థిక సంవత్సరం నాటికి 26 కొత్త ప్రొడక్టులను విడుదల చేస్తారు. వీటిలో ఎంపీవీ, ఆఫ్-రోడ్, ఎస్యూవీ, ఈవీలు ఉంటాయి. ఎగుమతుల వాటాను 30 శాతం వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోజ్ తెలిపారు. 2030 గ్రోత్ రోడ్మ్యాప్లో భాగంగా, హెచ్ఎంఐఎల్ తమ ఆదాయాలను 1.5 రెట్లు పెంచి, రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాలని టార్గెట్ విధించుకుంది.
రూ.45 వేల కోట్ల పెట్టుబడిలో 60 శాతం మొత్తాన్ని ఆర్ అండ్ డీ కోసం, మిగిలిన 40 శాతం సామర్థ్యం పెంపు, అప్గ్రేడేషన్కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. 2030 నాటికి దేశీయ మార్కెట్ వాటాను 15 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.