ఐపీఓపై నిర్ణయం ఇంకా తీసుకోలే .. ప్రకటించిన హ్యుందాయ్ మోటార్‌‌‌‌

ఐపీఓపై నిర్ణయం ఇంకా తీసుకోలే .. ప్రకటించిన హ్యుందాయ్ మోటార్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో తమ సబ్సిడరీ కంపెనీని లిస్టింగ్ చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సౌత్‌‌ కొరియన్ కంపెనీ హ్యుందాయ్‌‌  మోటార్‌‌ బుధవారం ప్రకటించింది. ఇంకో నెల రోజుల్లో లేదా ఐపీఓ ప్లాన్స్ పూర్తయ్యాక ప్రకటన చేస్తామని తెలిపింది.  ‘గ్లోబల్ కంపెనీగా సబ్సిడరీ కంపెనీలను లిస్టింగ్ చేయడం, ఎంటర్‌‌‌‌ప్రైజ్ వాల్యూని పెంచుకోవడం వంటి వివిధ చర్యలు తీసుకుంటాం.

కానీ, ఇండియన్ మార్కెట్‌‌లో లిస్టింగ్‌‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని హ్యుందాయ్ మోటార్  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది. కాగా, హ్యుందాయ్ సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా  ఐపీఓకి వస్తుందని,  3 బిలియన్ డాలర్లు సేకరిస్తుందని  రాయిటర్స్‌‌ మంగళవారం  రిపోర్ట్ చేసింది. ఐపీఓ కోసం జేపీ మోర్గాన్‌‌,  మోర్గాన్‌‌ స్టాన్లీ, సిటీ బ్యాంక్‌‌, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి బ్యాంకులతో ఈ కంపెనీ  చర్చలు జరుపుతోందని  తెలిపింది. సౌత్ కొరియన్ స్టాక్ మార్కెట్‌‌లో  హ్యుందాయ్‌‌ మోటార్  మార్కెట్ క్యాపిటలైజేషన్  42 బిలియన్  డాలర్లు ఉండగా,  దీని  ఇండియన్ సబ్సిడరీ వాల్యూ 30 బిలియన్ డాలర్ల వరకు పలుకుతుందని అంచనా.