మాస్క్‌‌లు కంపల్సరీ.. భౌతిక దూరం పాటించండి

మాస్క్‌‌లు కంపల్సరీ.. భౌతిక దూరం పాటించండి

కరోనా వైరస్‌‌తో జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌‌లు ధరించడంతో పాటు.. భౌతిక దూరం పాటించాలని టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ & సొసైటీ డాక్టర్ రాకేష్ మిశ్రా ప్రజలకు సూచించారు. కేసుల సంఖ్య అధికంగానే ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలన్నారు. వేరియంట్లూ వస్తూనే ఉంటాయని..అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో కరోనా 4th వేవ్ వ్యాపిస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకునేంత వరకు ఫర్వాలేదన్నారు. 

మరోవైపు... దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం (జూన్ 5న) 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 

మరిన్ని వార్తల కోసం : -

కేరళలో నోరో వైరస్ కలకలం


వరుసగా రెండో రోజు 4 వేలకుపైగా కేసులు