వరుసగా రెండో రోజు 4 వేలకుపైగా కేసులు

వరుసగా రెండో రోజు 4 వేలకుపైగా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం (జూన్ 5న) 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,12,87,000 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 2,57,187 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం..

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

మాల విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ