నిన్నటి తమ్ముడు ఇయ్యాల దయ్యమైండా? 

నిన్నటి తమ్ముడు ఇయ్యాల దయ్యమైండా? 

హైదరాబాద్: నిన్నటి తమ్ముడు ఇయ్యాల దయ్యమెట్ల అయ్యిండని సీఎం కేసీఆర్‌‌ను టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. గత మూడ్రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసైన్డ్ భూములు కొంటే తాను శిక్షకు అర్హుడినని తెలిపారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని దుయ్యబట్టారు.  

‘కేసీఆర్‌‌ను ఒక్కటే అడుగుతున్నా.. ఉద్యమంలో 14 ఏళ్లపాటు నీ వెంట నడిచా. నువ్వు మమ్మల్ని గౌరవించడమే గాక నా తమ్ముడని గొప్పగా చెప్పినవ్. అలాంటిది ఒక్కసారే మీకు ఈ తమ్ముడు దయ్యమెలా అయ్యాడు? మేం ఏం చేశామని? నేను పార్టీ పెడతానని ఏ ఒక్క నాయకుడితోనూ చెప్పలేదు. పార్టీ మారుతానని కూడా చెప్పలేదు. కానీ అధికారంతో నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు’ అని ఈటల రాజేందర్ చెప్పారు.