శ్రీదేవి తర్వాత అంత గొప్పగా నటించింది నేనే..

శ్రీదేవి తర్వాత అంత గొప్పగా నటించింది నేనే..

కంగనారనౌత్  ఏం  మాట్లాడినా తూటాలు పేల్చినట్టుంటుంది. ఎక్కువగా నెగిటివ్ ‌‌విషయాలపైనే రియాక్టవుతుందేమో..ఆమెపాజిటివ్ విషయాలుమాట్లాడినా నెగిటివ్‌‌గానే ఎక్స్‌‌పోజ్‌అవుతూ ఉంటాయి. రీసెంట్‌‌గా‘తనువెడ్స్ మను’మూవీ గురించి చేసినకామెంట్స్ విషయంలోనూ అదే జరిగింది. కంగన కెరీర్‌‌ని మలుపు తిప్పిన సినిమా ‘తనువెడ్స్ మను’. ఈ సినిమా రిలీజై ఫిబ్రవరి 25కి పదేళ్లు కావడంతో కంగనా రియాక్టయ్యింది. ‘ఈ సినిమానాకు చాలా ప్రత్యేకం. రొటీన్ పాత్రల్లో పడికొట్టుకుపోతున్న నాకు ఓ కొత్త దారి చూపించిందీ సినిమా. స్ట్రాంగ్ ‌ క్యారెక్టర్..పైగా కామిక్ రోల్. ఈ పాత్రతో నా కామెడీ టైమింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. శ్రీదేవి తర్వాత అంత గొప్పగా కామెడీని  పండించిన హీరోయిన్ని నేనే’ అంది కంగన. దాంతో కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. బాగా యాక్ట్ చేశాననడంలో తప్పులేదు కానీ శ్రీదేవితో పోలిక అవసరమా అంటూ నిలదీశారు. ఎవరి మాటలూ పట్టించుకోదు కాబట్టి కంగన లైట్ తీసుకుంది. అయితే ఈ సినిమా గురించి కామెంట్ చేస్తూ లీడ రోల్ చేసిన తనను మానేసి తన ఫ్రెండ్‌‌గా నటించిన స్వరాభాస్కర్‌‌ను ట్యాగ్ చేసినందుకు మాత్రం నొచ్చుకుంది. ‘నేను కాకుండా ఆలియానో, స్వరానో, తాప్సీనో అయ్యుంటే వీళ్లంతా సంతోషించేవారు. ఇవేం అభిమానాలో ఏంటో’ అంటూ తనదైన స్టైల్లో నెటిజన్స్ పై కస్సుమంది.