
- పారిస్ టూర్ తర్వాత పాజిటివ్
లాస్ఏంజెల్స్: పారిస్టూర్ తర్వాత తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా చెప్పారు. ప్రస్తుతం ఆమె హెల్త్ గురించి వస్తున్న రూమర్స్పై ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “ మనలో యాంటీ బాడీస్ ఉన్నాయని అంటే మనకు వైరస్ ఉన్నట్లే. పారిస్ టూర్ వెళ్లి వచ్చిన తర్వాత నాతో పాటు వచ్చిన అందరికీ వైరస్ వచ్చింది. మేమంతా భయపడ్డాం. థ్యాంక్ గాడ్ ప్రస్తుతం మేం హెల్తీగా ఉన్నాం” అని మడోన్నా అన్నారు. వైరస్పై సొంతంగా రిసెర్చ్ చేయకుండా సెన్సేషనల్ హెడ్డింగ్స్ చూసి నమ్మే వాళ్లకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను అని ఆమె అన్నారు.