బతికున్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటా

బతికున్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటా

తాను బతికి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. తర్వాత కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కమల్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వారి విమర్శలు ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లోనే ఉంటానంటూ ట్విట్టర్‌లో వీడియో రిలీజ్ చేశారు. రాజీనామా చేసినవాళ్లు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారికి కాలమే బదులిస్తుందని కమల్ హాసన్ అన్నారు.