రాజస్థాన్‌లో కూలిపోయిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్

రాజస్థాన్‌లో కూలిపోయిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నిఘా విమానం ఒకటి గురువారం రాజస్థాన్ రాష్ట్రంలో కూలిపోయింది. పైలట్ లేకుండా నడిచే తేలికపాటి తేజస్ యుద్ధ విమానం జైసల్మేర్ కు25 కిలో మీటర్ల దూరంలో పితాలా గ్రామ సమీపంలో ఏప్రిల్ 25 ఉదయం 10గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

రిమెట్ కంట్రోల్ తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వేదికగా తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ అధికారులు ఖుహ్రీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ తోపాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేజస్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు కోర్టులో విచారణ చేపట్టారు.