యాంటీ–టొబాకో రూల్స్​ పాటించడం ఓటీటీలకు కష్టమే: ఐఏఎంఏఐ

యాంటీ–టొబాకో రూల్స్​ పాటించడం ఓటీటీలకు కష్టమే: ఐఏఎంఏఐ

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్తగా తెచ్చిన యాంటీ–టొబాకో వార్నింగ్​ రూల్స్​ అమలు చేయడం ప్రాక్టికల్​గా ఓవర్​ది టాప్​(ఓటీటీ) ప్లాట్​ఫామ్స్​కు కష్టమవుతుందని ఇంటర్​నెట్​ అండ్​ మొబైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఐఏఎంఏఐ) వెల్లడించింది. ఓటీటీలలో చూపించే కంటెంట్​ అంతటా ఇలాంటి వార్నింగ్​ చూపించడం అసాధ్యమవుతుందని తెలిపింది. కన్జూమర్​ వ్యూయింగ్​ ఎక్స్​పీరియన్స్​పైనా ఈ కొత్త రూల్స్​ ఎఫెక్ట్​ పడుతుందని పేర్కొంది. థియేటర్లు, టెలివిజన్​ ప్రోగ్రామ్​ల తరహాలోనే ఓటీటీలు కూడా కంటెంట్​లో  యాంటీ–టొబాకో వార్నింగ్స్​ చూపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా రూల్స్​ తెచ్చింది. కొత్త రూల్స్​ తెచ్చేముందు పరిశ్రమతో అసలు చర్చించనేలేదని చెబుతూ, ఆన్​లైన్​ క్యూరేటెడ్​ కంటెంట్​ప్రొవైడర్లు​ (ఓసీసీపీ) ఐటీ రూల్స్​ కింద ఇన్ఫర్మేషన్​ అండ్​ బ్రాడ్​కాస్టింగ్​ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నారని వివరించింది. ఎంఐబీ వద్ద 57 ఓసీసీపీలు రిజస్టరయ్యాయి. వీటిలో ఒక్క దానిని కూడా కొత్త రూల్స్​ తేవడానికి ముందు సంప్రదించ లేదని ఐఏఎంఏఐ వాపోయింది.