ఎకానమీకి ప్యాకేజింగ్ రంగం కీలకం: ఐఏఎస్ సంజయ్ కుమార్

ఎకానమీకి ప్యాకేజింగ్ రంగం కీలకం: ఐఏఎస్ సంజయ్ కుమార్

హైదరాబాద్​, వెలుగు:  కారుగేటెడ్ ప్యాకేజింగ్ (కార్డ్‌‌‌‌ బోర్డ్ బాక్సుల) రంగం పర్యావరణానికి మేలు చేయడమేగాక, ఎకానమీకి వెన్నెముకగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ వేదికగా 2027 జనవరిలో జరిగే ఇంటర్నేషనల్ ​కారుగేటెడ్​కేస్​ అసోసియేషన్​(ఐసీసీఏ) గ్లోబల్ సమిట్ కోసం బుధవారం హైదరాబాద్​లో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. 

64 ఏళ్ల ఈ సంస్థ చరిత్రలో తొలిసారిగా మన నగరంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగడం గర్వకారణమని చెప్పారు.   తెలంగాణ ప్రభుత్వం ఈ సదస్సుకు పూర్తి సహకారం అందిస్తుందని, దీని ద్వారా కొత్త పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.90 వేల కోట్లుగా ఉందని, ఇది భవిష్యత్తులో వేగంగా వృద్ధి చెందుతుందని కుమార్​ వివరించారు. ఈ మెగా ఈవెంట్ లో ఎఫ్​సీబీఎం కారుప్యాక్ సమిట్, కారుప్యాక్ ఇంటర్నేషనల్ ఎక్స్​పో కూడా ఉంటాయి.