పాలనపై పట్టుబిగిస్తున్న ఏపీ సీఎం జగన్ రోజుకొక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్ననే ప్రభుత్వ విప్,విప్ హోదాలను రద్దు చేసిన జగన్ ..భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా పీయూష్ కుమార్
- సీఆర్డీఏ కమిషనర్ గా పి.లక్ష్మీ నృసింహ
- గుంటూరు కలెక్టర్ గా ఐ. శ్యామ్యూల్ ఆనంద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్ గా పి.భాస్కర్
- తూర్పు గోదావరి కలెక్టర్ గా డి. మురళీధర్ రెడ్డి
- నెల్లూరు కలెక్టర్ గా ఎం.వీ. శేషగిరిబాబు
- అనంతపురం కలెక్టర్ గా ఎస్ సత్యనారాయణ
- పశ్చిమ గోదావరి కలెక్టర్ గా ఎం. ముత్యాలరాజు
- విశాఖ కలెక్టర్ గా వి. వినయ్ చంద్
- కర్నూలు కలెక్టర్ గా జి.వీరపాండ్యన్
- చిత్తూరు కలెక్టర్ గా నారాయణ భరత్ గుప్తా
- యువజన వ్యవహారాలు, పర్యాటశాఖ ఎండీగా కాటంనేని భాస్కర్
- సీఎం ఓఎస్డీగా జె.మురళి
- సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా కె.విజయ
- ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ గా కాంతిలాల్ దండే
- మున్సిపల్ కమిషనర్ గా విజయకుమార్
- పంచాయతీరాజ్ కమిషనర్ గా గిరిజాశంకర్
- సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ గా కె.హర్షవర్ధన్
- వ్యవసాయ శాఖ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్
- రవాణాశాఖ కమిషనర్ గా సీతారామాంజనేయులు
- ఎక్సైజ్ కమిషనర్ గా ఎం.ఎం.నాయక్
- ఉద్యానశాఖ కమిషనర్ గా చిరంజీవి చౌదరి
- ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్
- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్
- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా రంజిత్ భాషా, కన్నబాబుకు ఆదేశం