అపోలో ఆస్పత్రిలో ఏడుగురికి చికిత్స.. ఒకరికి సీరియస్

అపోలో ఆస్పత్రిలో ఏడుగురికి చికిత్స.. ఒకరికి సీరియస్

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.  ఈ ఘటనలో నిన్న  మమత(25), షుష్మ(26) మృతిచెందగా.. అర్ధరాత్రి  మాడుగుల మండలం కొలుకుల పల్లి అనుబంధ గ్రామం రాజీవ్ నగర్ తండాకు చెందిన మేరావత్ మౌనిక(25), ఈ రోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్ గ్రామానికి చెందిన అవుతపురం లావణ్య(25)  మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో  ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ICUలో చికిత్స అందిస్తున్నారు. అటు ఇవాళ ఉదయం చనిపోయిన లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్కార్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న  34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇందులో ఆపరేషన్లు ఫెయిలై పలువురి పరిస్థితి విషమంగా మారడంతో నిన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఇద్దరు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పులన పరిహారం అందజేసింది. మిగిలిన 30 మందిని కూడా అపోలో హాస్పిటల్ లో తోపాటు వివిధ హాస్పిటల్స్ కు తరలించి అధికారులు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు . ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న మహిళల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మెడికల్ టెస్టులు చేస్తున్నారు.