
హైదరాబాద్, వెలుగు: భారతదేశ వెబ్3 ఎకోసిస్టమ్ను మరింత ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్న ఇండియా బ్లాక్చెయిన్ టూర్ (ఐబీటీ) 2025 హైదరాబాద్లో ప్రారంభమైంది. అక్టాలూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యటనలో బ్లాక్చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీలు, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, నాన్-ఫంగిబుల్ టోకెన్లు, వెబ్3కి సంబంధించిన అంశాలపై ప్రజలకు, డెవలపర్లకు, పెట్టుబడిదారులకు, వ్యవస్థాపకులకు అవగాహన కల్పిస్తారు.
ఈ కార్యక్రమం దేశంలోని ఎనిమిది నగరాల్లో జరుగుతుంది. ఇది విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, డెవలపర్లు, బ్లాక్చెయిన్ ఎక్స్పర్టులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఈ సందర్భంగా ఫైర్సైడ్ చాట్లు, పాలసీ ప్యానెల్లు, డెవలపర్ల కోసం వర్క్షాప్లు, స్టార్టప్ షోకేస్లు నిర్వహిస్తారు. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ టూర్ నవంబర్ 30న బెంగళూరులో ముగుస్తుంది.