
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను విస్తరించేందుకు ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఐసీసీ చైర్మన్ జై షా.. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ (యూఈఎఫ్ఏ) ప్రెసిడెంట్ అలెగ్జాండర్ సెఫెరిన్ను శనివారం కలిశారు. అలియాంజ్ అరీనాలో ఇంటర్ మిలన్, పారిస్ సెయింట్ జర్మన్ మధ్య జరిగే చాంపియన్స్ లీగ్కు ముందు ఈ భేటీ జరిగింది.
‘చాంపియన్స్ లీగ్ ఫైనల్కు ముందు మ్యూనిచ్లో క్రికెట్కు ప్రాతినిధ్యం వహించడం, యూఈఎఫ్ఏ ప్రెసిడెంట్తో చర్చలు జరపడం గౌరవంగా ఉంది. మన క్రీడ యొక్క ప్రపంచ పరిధిని విస్తరిస్తున్నందున ఇతర క్రీడా నాయకులతో సమయం గడపడం ఎల్లప్పుడూ విలువైనది’ అని షా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనూ ఐవోసీ సెషన్స్కు ముందు లుసానేలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) మాజీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ను కూడా జైషా కలిశాడు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్తో విశ్వక్రీడల్లో క్రికెట్ ప్రస్థానం మళ్లీ మొదలుకాబోతున్నది.