టీ20 టీమ్​ డైరెక్టర్‌గా ధోనీ!

టీ20 టీమ్​ డైరెక్టర్‌గా ధోనీ!

న్యూఢిల్లీ: ఐసీసీ ఈవెంట్లలో ఇండియా వరుసగా ఫెయిలవుతున్న నేపథ్యంలో టీమ్​ మేనేజ్​మెంట్​లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోనీని.. ఇండియా టీ20 టీమ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ మేరకు ఇప్పటికే మహీకి బోర్డు నుంచి ఆఫర్​ వెళ్లినట్టు సమాచారం.

హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పని భారం తప్పించేందుకు  బోర్డు  మహీకి టీ20 బాధ్యతలను పర్మినెంట్‌గా ఇవ్వాలని యోచిస్తోంది. ఈ అంశంపై ఈ నెల చివర్లో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించనుంది. ధోనీ వచ్చే ఐపీఎల్​తో ఆటకు పూర్తిగా గుడ్​బై చెబుతాడన్న ప్రచారం జరుగుతోంది.  ఆ తర్వాత తను టీమిండియాకు సేవలు అందించొచ్చు.