
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్లో మార్పుల గురించి మూడు సభ్య దేశాల బోర్డు మెంబర్లు ఐసీసీకి లేఖ రాశారని బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం వెల్లడించాడు. మరో నాలుగైదు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందన్నాడు. ‘వరల్డ్ కప్ షెడ్యూల్లో తేదీ, టైమ్ మాత్రమే మారుతాయి. వేదికను మార్చే ప్రసక్తే లేదు. ఇతర మ్యాచ్ల మధ్య ఆరు రోజుల విరామాన్ని నాలుగైదు రోజులకు కుదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఐసీసీ అనుమతితో మార్పులు చేస్తాం’ అని జై షా పేర్కొన్నాడు. అయితే తేదీ మార్పు గురించి ఏ దేశం ఐసీసీని అడిగిందనే దానిపై స్పష్టత లేదు. ఇక వెన్ను సర్జరీ నుంచి కోలుకుంటున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్తో సిరీస్లో ఆడే అవకాశం ఉందని సెక్రటరీ సంకేతాలిచ్చాడు. ఎన్సీఏలో ఎక్స్టెన్సివ్ రిహాబిలిటేషన్లో ఉన్న పేసర్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పాడు.