పాక్​ టీమ్​కు వీసాలు అందలే..

 పాక్​ టీమ్​కు వీసాలు అందలే..

ఇండోర్‌‌: పాకిస్తాన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ టీమ్‌‌కు ఇంకా ఇండియన్‌‌ వీసాలు లభించలేదు. షెడ్యూల్‌‌ ప్రకారం పాక్‌‌ ఈ నెల 27న హైదరాబాద్‌‌కు చేరుకోవాలి. టీమ్​ బాండింగ్​లో భాగంగా ప్లేయర్లందరూ దుబాయ్‌‌లో కలుసుకొని అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు రావాలని ప్లాన్‌‌ చేసుకున్నారు.

 ‘శుక్రవారం ఇస్లామాబాద్‌‌లోని ఇండియన్‌‌ ఎంబసీకి పాస్‌‌పోర్ట్‌‌ల కోసం వెళ్లాం. కానీ వీసా ప్రాసెస్‌‌ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. దీంతో బలవంతంగా దుబాయ్‌‌ ట్రిప్‌‌ను రద్దు చేసుకున్నాం. 27న డైరెక్ట్‌‌గా హైదరాబాద్‌‌ బయలుదేరతాం’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 29న పాక్‌‌ హైదరాబాద్​లో న్యూజిలాండ్‌‌తో వామప్‌‌మ్యాచ్‌‌ ఆడనుంది.