
ఆర్మూర్, వెలుగు : అతడు కారు ఓనర్ కమ్ డ్రైవర్. కొన్నేండ్లుగా నిజామాబాద్ జిల్లా ఐసీడీఎస్ఇన్చార్జి పీడీ, ఆర్మూర్ సీడీపీఓ కూడా అయిన ఝాన్సీ లక్ష్మి దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో ‘మేడమ్ కిరాయి పైసలొస్తలేవ్..కుటుంబం గడవక ఇబ్బంది పడుతున్నా. దయచేసిఇప్పించండి’ అని విన్నవించుకున్నాడు. ఆమె మాత్రం రూ.20 వేలు ఇస్తేనే బిల్లు శాంక్షన్చేయిస్తానని ఖరాకండిగా చెప్పడంతో కలత చెందాడు. ఇంతకాలం నుంచి నమ్మకంగా పని చేస్తుంటే తననే లంచం అడుగుతుందా అని ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనలతో లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్కథనం ప్రకారం..మహేందర్అనే వ్యక్తి తన కారును పదేండ్ల నుంచి ఆర్మూర్ ఐసీడీఎస్ ఆఫీస్ కు కిరాయికి పెట్టాడు. డ్రైవర్గా కూడా తానే ఉన్నాడు. దీనికి నెలకు రూ.33వేలు ఇవ్వాలనేది ఒప్పందం. ఎనిమిది నెలల నుంచి కిరాయి రాకపోవడంతో ఇన్చార్జి పీడీ ఝాన్సీని అడగ్గా తనకు డబ్బులిస్తేనే శాంక్షన్ చేయిస్తానని చెప్పింది. దీంతో మహేందర్ ఏసీబీని ఆశ్రయించి ఝాన్సీకి రూ.12వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మంగళవారం ఆర్మూర్ ఎంపీడీఓ ఆఫీసులో దివ్యాంగుల ప్రత్యేక శిబిరానికి ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఝాన్సీలక్ష్మి హాజరైంది. శిబిరం నడుస్తుండగా మహేందర్ ఫోన్ చేసి డబ్బులు తెచ్చానని చెప్పడంతో ఆర్మూర్ సీడీపీఓ ఆఫీసుకు వచ్చింది. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్అర్చన లంచం తీసుకుని ఇన్చార్జి సీడీపీఓ ఝాన్సీకి ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నగేశ్పాల్గొన్నారు.