రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతం : ఎర్రబెల్లి

రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖతం : ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని ఖతమైపోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన ఏ పార్టీలో అడుగుపెట్టినా ఆ పార్టీ బలహీనమవుతుందని విమర్శించారు. టీడీపీని కూడా బలహీనపరిచింది రేవంత్ అని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన వెంట పార్టీ కార్యకర్తలెవరూ లేరని ఎర్రబెల్లి అన్నారు. హుందాతనాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్న రేవంత్ కు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి తప్పు చేసిందన్నారు. 

రేవంత్ రెడ్డి తన కామెంట్లతో నక్సలైట్లను సపోర్ట్ చేశాడా? లేక రెచ్చగొట్టాడా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ ఎజెండా వేరు నక్సల్స్ ను పేల్చమనడం వేరన్న విషయాన్ని రేవంత్ తెలుసుకోవాలని సూచించారు.