షాకిస్తున్న ఆదిపురుష్ 3డీ టికెట్ ధర.. అయినా ఫ‌స్ట్ డే ఫుల్

షాకిస్తున్న ఆదిపురుష్ 3డీ టికెట్ ధర.. అయినా ఫ‌స్ట్ డే ఫుల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మరికొన్ని గంటల్లో రాఘవుడిగా ప్రేక్షకులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి సనన్(Kriti Sanon) సీతగా కనిపిస్తున్న ఈ సినిమాని.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om raut) తెరకెక్కిస్తున్నాడు. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాను ఆడియన్స్ 3Dలో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి కారణం.. రామాయణం గాధను ఇప్పటికే ప్రేక్షకులు చాలా సార్లు చూసి ఉన్నారు. కానీ ఆదిపురుష్ సినిమాను లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కించారు మేకర్స్. ఇందుకోసం మోషన్ క్యాప్చర్ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. అంతేకాదు.. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా రానుంది.

ప్రేక్షకులకు 3D అనేది ఎప్పుడూ కొత్త అనుభూతుని ఇస్తుంది. రామాయణం లాంటి గొప్ప ఇతిహాసాన్నీ 3Dలో వీక్షించడం అనేది ప్రేక్షకులకు ఎగ్జైట్మెంట్ ను క్రియేట్ చేస్తోంది. అందుకే ఈ సినిమాను 3Dలో చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. మామూలు టికెట్స్ కంటే 3D ధర ఎక్కువైనప్పటికీ దానివైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కు సంబందించిన టికేట్స్ అన్నీ ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. 

ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై కూడా పడే అవకాశం ఉంది. దీంతో మొదటి రోజు ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మొత్తంగా ఆదిపురుష్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.