
న్యూఢిల్లీ: సెబీ రెండేళ్లపాటు బ్యాన్ విధించిన నేపథ్యంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ షేర్లు మంగళవారం 19 శాతం పతనమయ్యాయి. క్లయింట్ల ఫండ్స్ను దుర్వినియోగం చేసిందనే ఆరోపణల మీద సెబీ రెండేళ్ల బ్యాన్ను పెట్టింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ షేర్లు భారీగా పడ్డాయి. 2011–2017 మధ్య కాలంలో చేపట్టిన తనిఖీలలో కంపెనీ అవకతవకలు బయటపడినట్లు సెబీ తెలిపింది.
క్లయింట్ల డబ్బును సొంత ట్రేడింగ్ కోసం కంపెనీ వాడుకుందని పేర్కొంది. రూల్స్ అతిక్రమించడంతో రెండేళ్లపాటు కొత్త క్లయింట్లను తీసుకోకుండా ఆదేశిస్తున్నట్లు సెబీ హోల్టైమ్ మెంబర్ ఎస్ కే మొహంతి తన ఆర్డర్లో పేర్కొన్నారు. సెబీ నిర్ణయం మీద అప్పీల్కు వెళ్లనున్నట్లు మరో వైపు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ తెలిపింది.