జేఈఈ, నీట్ కోసం ‘కోటా పేజెస్ డాట్ ఇన్’ పోర్టల్ ప్రారంభం

జేఈఈ, నీట్ కోసం ‘కోటా పేజెస్ డాట్ ఇన్’ పోర్టల్ ప్రారంభం

హైదరాబాద్: జేఈఈ, నీట్ –2022 ప్రవేశ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులకు కోసం 'కోటా పేజెస్ డాట్ ఇన్' వెబ్ పోర్టల్ ను ప్రారంభించినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం తెలిపింది. ఈ పోర్టల్ నీట్, జేఈఈకి సంబంధించిన డిజిటల్ స్టడీ మెటీరియల్ (కాన్సెప్ట్స్, మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ), గ్రాండ్ టెస్ట్స్ ఉంచామని ఫోరం నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా నీట్ ప్రీవియస్ టెస్ట్స్  అండ్ సొల్యూషన్స్ పేపర్స్, ర్యాంక్ బూస్టర్ టెస్ట్స్, ఎన్సీఈఆర్టీ నీట్ క్వశ్చన్ బ్యాంక్, టెస్ట్ సిరీస్ ను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. డౌన్ లోడ్ కోసం www.kotapages.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని వారు తెలిపారు.