
నిజామాబాద్, వెలుగు: వెన్నునొప్పితో బాధపడుతూ ఆపరేషన్ కోసం నగరంలోని శశాంత్ హాస్పిటల్లో చేరిన కెతావత్ భాస్కర్ (19) ఆదివారం మృతిచెందాడు. ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్న టైంలో అనెస్థీషియా మోతాదుకు మించి ఇవ్వడంతోనే భాస్కర్చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్ధాపూర్ కు చెందిన భాస్కర్ చదువులో ప్రతిభ కనబర్చడంతో మద్రాస్ ఐఐటీలో సీట్ కన్ఫర్మ్ అయింది.
కాగా, కొంతకాలంగా వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుండడంతో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లడానికి శనివారం తల్లిదండ్రులు, బంధువుల సహాయంతో నగరంలోని హాస్పిటల్ వచ్చాడు. ఆపరేషన్ చేస్తే సమస్య తీరుతుందని డాక్టర్లు చెప్పడంతో అడ్మిట్అయ్యాడు. ఆదివారం ఆపరేషన్ కోసం డాక్టర్లు థియేటర్లోకి తీసుకెళ్లగా, బయటకు వచ్చి అతడు మృతిచెందాడని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. మత్తు మందు డోస్ ఎక్కువ ఇవ్వడం వల్లే భాస్కర్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సముదాయించారు.