జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: ఐజేయూ

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: ఐజేయూ

జీడిమెట్ల, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్​ నిబద్ధతతో పనిచేస్తోందని టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.  షాపూర్​నగర్ శుభం హోటల్​లో సోమవారం జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. త్వరలోనే ఆక్రిడిటేషన్​, హెల్త్​కార్డులు, ఇతర జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 

కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గొలిపెల్ల దయాకర్, యూనియన్​ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాల్​రాజ్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామ్​రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.