
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ శ్రీపురం కాలనీలో ఛత్రపతి శివాజీ పార్కును కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి ఆరోపించారు. సోమవారం వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజావసరాల కోసం ఉంచిన పార్కును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్నారు. శ్రీపురం కాలనీలో సుమారు 20 వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విచారణ జరిపి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామన్నారు.