తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. జనం భయటకు రావాలంటే బయపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఐదు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
https://www.youtube.com/watch?v=rFr6zTq_MJU