
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట అటవీ ప్రాంతంలోని లోతు వాగు బ్రిడ్జి సమీపంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. లోతైన గృహలు, వాటర్ ఫాల్స్తోపాటు చుట్టూ దట్టమైన అటవీలో కిలకిల రాగాలతో శబ్దాలు చేసే పక్షులు ఈ ప్రాంతానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తే బాగుంటుందని పలువురు పర్యటకులు అభిప్రాయ పడుతున్నారు. - అశ్వారావుపేట, వెలుగు