మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

దామెరభీమపల్లిలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పలు వాహనాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండగా కొందరు స్థానికులు వారిని పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన మద్యం, గులాబీ జెండాలను రోడ్డుపై పెట్టి ఆందోళన చేశారు.

కారులో పట్టుబడిన రూకారులో రూ.10లక్షలు ఎవరివి..? 
మునుగోడు నియోజకవర్గంలోని భీమనపల్లి గ్రామంలో నంబర్ ప్లేట్ లేని ఒక కారులో 10 లక్షల నగదు పట్టుబడింది. నగదు దొరికిన కారుపై ఎంపీ స్టిక్కర్ ఉంది. అయితే.. ఈ కారు ఎవరిది అనే దానిపై విచారణ సాగుతోంది.