కానిస్టేబుల్ ను ట్రక్కుతో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

కానిస్టేబుల్ ను ట్రక్కుతో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకోవడమే ఆ కానిస్టేబుల్ పాపమైంది. ఇసుక తరలిస్తున్న వ్యక్తి తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో ట్రాక్టర్​ని ఏకంగా కానిస్టేబుల్​పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో పోలీస్​ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటక రాష్ర్టంలో  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కలబురిగి జిల్లా నిలోగి పోలీస్​ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మైసూర్​ చౌహాన్​(51) అనే కానిస్టేబుల్​దుండగుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అదే జిల్లాలోని అఫ్జల్​పూర్​ తాలుకాకు చెందిన వారు.  

జెవర్గీ తాలుకా నారాయణపూర్​లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని చౌహాన్​ తోటి సిబ్బందితో కలిసి ఇసుక మైనింగ్​ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారిని ఆయన ప్రశ్నించగా ట్రాక్టర్​ డ్రైవర్​ విచక్షణ మరిచి చౌహాన్​ మీది నుంచి ట్రాక్టర్​ పోనించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.  ఇలా జరగడం బాధగా ఉందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కర్ణాటక మంత్రి ఎంసీ సుధాకర్ హామీ ఇచ్చారు. నారాయణపూర్​ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు లు వెళ్లాయి. ఆ ప్రాంతంలోనే కానిస్టేబుల్​ చౌహాన్​కి పోస్టింగ్​ ఇచ్చారు. 

బీజేపీ మండిపాటు..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అక్రమార్కుల రెచ్చిపోతున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ఆ పార్టీ నేషనల్​స్పోక్స్​ పర్సన్​షెజాద్​ పునావాలా మాట్లాడుతూ.. కానిస్టేబుల్​ మృతి చెందటం బాధాకరం అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తరువాత లా అండ్​ ఆర్డర్​ఏ రకంగా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అక్రమార్కులకు, ఇసుక మాఫీయాకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.